బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక్కడ కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఛత్రపతి చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జయంతిలాల్ గడ్డా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారా అన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించగా బెల్లంకొండ బాలీవుడ్ కు కొత్తవాడు కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. అయితే మొత్తానికి బాలీవుడ్ భామ నుష్రత్ భరూచాను కన్ఫర్మ్ చేసారు. శ్రియ శరన్ రోల్ ను ఆమె పోషిస్తోంది.
నుష్రత్ సోను కె టిటు కి స్వీటీ, చలాంగ్ వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా రామ్ సేతు చిత్రంలో నటిస్తోంది. ఇక ఛత్రపతి రీమేక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.