ప్రపంచ వ్యాప్తంగా కనోనా వైరస్ వికటాట్టహాసం చేస్తోంది. చైనాలో ఈ మహమ్మారి పుట్టినా దీని ధాటికి ఇటీల చిగురుటాకులా వణికిపోతోంది. చైనా కంటే ఇటలీలోనే దీని ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ వందల మంది దీని కారణంగా ప్రాణాలు విడిచారు. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే మన దేశంపై పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువ దీంతో నివారణ ఇక్కటేమార్గం అని సామాజిక బాధ్యతగా ఈ వైరస్ని ఎదుర్కోవాలని అంతా పిలుపునిస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఆలా మంది స్టార్స్ తమ చిత్రాలని అర్థాంతరంగా ఆపేశారు. షూటింగ్లతో పాటు రిలీజ్లు కూడా ఆగిపోయాయ్. కరోనా వైరస్ కట్టడికి తమ వంతు బాధ్యతలగా సోషల్ అవేర్నెస్ని కలిగిస్తూ పలువురు స్టార్స్ ముందుకొచ్చి వీడియో సందేశాలు పంపిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా వుంటే కొత్తగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ పాలిట కరోనా వైరస్ షాపంగా మారింది.
బెల్లంకొండ గణేష్ హీరోగా పవన్ సాధినేని డైరెక్షన్తో ఓ సినిమా ఆ మధ్య మొదలైన విషయం తెలిసిందే. కొంత భాగం షూటింగ్ కూడా జరిగిన ఈ చిత్రం కోసం అమెరికాలో 20 రోజుల పాటు భారీ షెడ్యూల్ని ప్లాన్ చేశారు. ఈ నెల 25 నుంచి ఆ షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అయితే తాజా పరిస్థితులు దారుణంగా మారడంతో యుఎస్ షెడ్యూల్ని వాయిదా వేశారట. పరిస్థితులు చక్కబడితే మే లేదా జూన్లో యుఎస్ వెళ్లాలనుకుంటున్నారట.