మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్లుక్ పోస్టర్ని మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
యూఎస్ నేపథ్యంలో కీలక షెడ్యూల్ని ప్లాన్ చేసిన మేకర్స్ కరోనా తీవ్రత నేపథ్యంలో ఆ షెడ్యూల్ని హైదరాబాద్లోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన సీన్ల కోసం హైదరాబాద్లో ఓ భారీ బ్యాంక్ సెట్ని నిర్మిస్తున్నట్టు తెలిసింది.
వేల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలు పారిపోయే విలన్ ని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే హీరో కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టైలిష్ విలన్గా అరవిందస్వామి నటించనున్నట్టు తెలిసింది. మరో కీలక పాత్రలో నివేదా థామస్ నటించనుందట. కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టిన తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.