Homeటాప్ స్టోరీస్మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంట విషాదం

మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంట విషాదం

bandaru dattatreyas son vaishnav dies heart attackమాజీ కేంద్ర మంత్రి , పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ ఇంట తీవ్ర విషాదం నెలకొంది . దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటు తో చనిపోయాడు దాంతో దత్తాత్రేయ కన్నీరు మున్నీరు అవుతున్నాడు . దత్తాత్రేయ దుఃఖాన్ని అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు , ఎదిగి వస్తున్న కొడుకు అర్దాంతరంగా తనువు చాలించడంతో శోక సంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం . 21 ఏళ్ల కే వైష్ణవ్ కు గుండెపోటు రావడం ఏంటి ? ఆశ్చర్యపోతున్నారు .

ఎం బి బి ఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ నిన్న రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దాంతో హుటా హుటిన ముషీరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు , దాదాపు రెండు గంటల పాటు వైష్ణవ్ ని బ్రతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేసారు డాక్టర్ల బృందం , కానీ డాక్టర్ల ప్రయత్నం ఫలించకపోవడంతో 12. 15 నిమిషాలకువైష్ణవ్ తుది శ్వాస విడిచాడు . దత్తాత్రేయ కుమారుడు చనిపోయాడని తెలియడంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All