నందమూరి బాలకృష్ణ లైగర్ టీమ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లైగర్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో ప్రెజంట్ చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా విడుదలవుతోంది. ఇదిలా ఉంటే లైగర్ సెట్స్ కు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాడు.
లైగర్ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించాడు. విజయ్ దేవరకొండ జై బాలయ్య అని తనతో దిగిన ఫోటోను ట్వీట్ చేసాడు. లైగర్ కాంబినేషన్ లో బాలయ్య పైసా వసూల్ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం సంగతి అటుంచితే పూరితో బాలయ్యకు మంచి ర్యాపో కుదిరింది. ఆ చనువుతోనే లైగర్ సెట్స్ కు వచ్చాడు. త్వరలోనే ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుందని సమాచారం.
A Legendary Visit to #Liger Sets
@ Goa#NandamuriBalakrishna garu made a surprise Visit to the sets of #Liger today & Blessed the team with high spirits @karanjohar #Purijagannadh @TheDeverakonda @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/iIM2BWJCvr— BA Raju’s Team (@baraju_SuperHit) September 22, 2021