Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే

బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే

బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే
బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే

ఒక్కోసారి ఒక దర్శకుడికి, ఒక హీరోకి మధ్య చెప్పలేని బంధం ఏర్పడుతుంది. వారిద్దరూ అభిప్రాయాల పరంగానే కాదు వ్యక్తిగతంగానూ ఒకలాంటి భావాలతో ఉంటారు. అలాంటి వారు మళ్ళీ మళ్ళీ కలిసిపనిచేయాలనుకుంటారు. హీరో ఎన్ని ప్లాపుల్లో ఉన్నా, లేదా ఆ దర్శకుడు ఎన్ని ప్లాపుల్లో ఉన్నా కానీ వారిద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే ట్రేడ్ లో ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. అలాంటి ఒక కాంబోనే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను. అయితే వీరిద్దరూ కలిసి చేసిన రెండు సినిమాలు సింహా, లెజండ్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ కాంబో సూపర్ సక్సెస్ కాంబోగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతుండడంతో ట్రేడ్ లో ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ చిత్రంపై ఉన్నాయి.

నిజానికి వీరిద్దరూ వ్యక్తిగతంగా ప్లాపుల్లో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ప్లాపులు కొడితే, బోయపాటి శ్రీను వినయ విధేయ రామ అనే అట్టర్ ప్లాప్ సినిమా తీసి ఉన్నాడు. ఇద్దరూ చేసే సినిమాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తుండడంతో ట్రేడ్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతోంది. ఇద్దరూ కలిసి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇస్తారని ఆశిస్తోంది.

- Advertisement -

ఇకపోతే దీనికి మరో యాంగిల్ ఉంది. బాలకృష్ణ ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రతిసారి బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేస్తే కలిసొస్తోంది. నరసింహనాయుడు అనే సినిమా 2001లో విడుదలైంది. అది బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద హిట్. అయితే దాని తర్వాత బాలయ్య చేసిన ఏవీ అంతగా కలిసిరాలేదు. చెన్నకేశవ రెడ్డి, లక్ష్మి నరసింహ వంటి సినిమా పర్వాలేదనిపించినా మిగిలినవి దారుణంగా పల్టీకొట్టాయి. అంతేనా… బాలయ్య జడ్జిమెంట్ పైనే సందేహాలు రేకెత్తించాయి.

అయితే 2010లో బోయపాటితో సింహా చేసిన బాలయ్య తన కెరీర్ లో అతిపెద్ద హిట్ ను అందుకున్నాడు. అయితే సింహా తర్వాత బాలయ్య మళ్ళీ రూట్ తప్పాడు. పరమవీర చక్ర, శ్రీమన్నారాయణ, అధినాయకుడు అంటూ ఏవేవో సినిమాలు చేసాడు కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అప్పుడే బోయపాటి శ్రీనుతో మళ్ళీ లెజండ్ చేసాడు, మళ్ళీ సక్సెస్ కొట్టాడు. ఏకంగా అప్పట్లోనే 40 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టింది లెజండ్. అయితే బోయపాటి సినిమా తర్వాత మళ్ళీ ట్రాక్ తప్పాడు. లెజండ్ తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి మినహాయిస్తే ఆ రేంజ్ హిట్ లేదు. రీసెంట్ గా చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు దారుణంగా పోయాయి. ఇప్పుడు మళ్ళీ బోయపాటి శ్రీనుతో పనిచేస్తుండడంతో బాలయ్య అభిమానులు మళ్ళీ తమను నువ్వే ఆదుకోవాలి అంటున్నారు. వినయ విధేయ రామ ప్లాప్ అయినా ఎక్కడ బోయపాటి మీద ఉన్న నమ్మకం పోలేదు. మరి ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకుని, బాలయ్యకు మరో మరపురాని విజయాన్ని అందిస్తాడా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All