లాక్డౌన్ కారణంగా టాలీవుడ్లో స్థబ్ధత ఏర్పడింది. షూటింగ్లు లేవు. థియేటర్లు లేవు. షూటింగ్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. థియేటర్లని ఎప్పుడు ఓపెన్ చేస్తారో క్లారిటీ లేదు. వరుసగా సినిమాలన్నీ రిలీజ్కు సిద్ధంగా వున్నాయి. కరోనా కారణంగా అన్నీ ఆగిపోవడంతో సినీ కార్మికులకు పనిలేదు. తినడానికి తిండి లేదు. దీంతో పెద్దన్న పాత్ర పోషించాలని ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
మెరుపు లాంటి ఆలోచనతో రోజు వారీ సినీ కార్మకులకు నిత్యావసరాలు అందించాలని సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ)ని ప్రారంభించారు. తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సి. కల్యాణ్ వంటి వారిని కలుపుకుని వారి సమన్వయంతో కార్మికులకు కష్టకాలంలో అండగా నిలవాలని మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు నెలలు గడిచింది. కరోనా తగ్గలేదు. కానీ ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. దీంతో షూటింగ్లు మొదలుపెట్టాల్సిందే అంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వమించారు.
అయితే ఇంత చేస్తే బలకృష్ణ మీటింగ్ల పేరుతో హైదరాబాద్లో భూములు పంచుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ని హర్ట్ చేశాయని తెలిసింది. దీంతో తదుపరి మీటింగ్లకు వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. తన సినిమాని జూలైలో పునః ప్రారంభించాలనుకున్న ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని ఆగస్టులో నిదానంగా మొదలుపెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన్టు తెలుస్తోంది.