Homeటాప్ స్టోరీస్బాలయ్య రచ్చ మొదలైందిగా

బాలయ్య రచ్చ మొదలైందిగా

బాలయ్య రచ్చ మొదలైందిగా
బాలయ్య రచ్చ మొదలైందిగా

నందమూరి బాలకృష్ణకు 2019 చేదు జ్ఞాపకాలను మిగిల్చిన సంగతి తెల్సిందే. గతేడాది మూడు సినిమాలను విడుదల చేసిన బాలయ్య మూడు డిజాస్టర్లను ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదలుపెట్టాలనుకున్న చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఆ రచ్చ వేరుగా ఉంటుంది. ఇప్పటివరకూ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజండ్ చిత్రాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో మూడోసారి కలిసి పనిచేస్తున్నారంటే ఆటోమేటిగ్గా అంచనాలు పెరిగిపోయాయి.

అయితే బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు నేడు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణను మొదలుపెట్టారు. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య – గుండాలతో ఫైట్ చేస్తున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ ను వారం పాటు చిత్రీకరించనున్నారు. దీనికి రామ్ – లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత అనంతపూర్ లో షూటింగ్ కొనసాగుతుందని సమాచారం.

- Advertisement -

ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఒక గెటప్ లో స్టైలిష్ గా ఉంటే మరొక గెటప్ లో అఘోర లుక్ లో కనిపిస్తాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కాశిలో సాగుతుంది. శరవేగంగా ఎటువంటి బ్రేకులు లేకుండా చిత్రీకరణను పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో అంజలి మొదటి హీరోయిన్ గా కనిపించనున్న విషయం తెల్సిందే. మరో హీరోయిన్ గా శ్రియను అనుకుంటున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య హిట్ కొట్టి తిరిగి ఫామ్ ను అందుకోవాలని ఆశిద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All