బాలకృష్ణ , బోయపాటి శ్రీను ల కంబినేషన్ కు ప్రత్యేకత వుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ముచ్చటగా మూడవసారి వీరిద్దరూ కలిసి వర్కుచేస్తున్నారు. బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
దీనిపై బాలకృష్ణ స్పందించారు బోయపాటితో చేస్తున్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు.మా కాంబినేషన్లో వస్తోన్న మూడవ సినిమా ఇదని, మా ఇద్దరి కలయికలో సినిమా అంటే ఆ వైబ్రేషన్స్ ఇలానే ఉంటాయన్నారు. మా ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. టీజర్ ఇండియాలోనే ట్రేండింగ్ లో వుంది. టీజర్ చూసి సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తోంది. బోయపాటి నేను స్పీఎదుగా సినిమా పూర్తి చేస్తాం.
షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక రెట్టించిన వేగంతో సినిమా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకెళతాం. కరోనా వున్నా నిబంధనలు పాటిస్తూ అందరికి ఆదర్శంగా ఉంటూ రికార్డు కోసం కేక్ కట్ చేసిన అభిమానులకు, విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని అన్నారు బాలకృష్ణ.