తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబలి కి దక్కుతుంది . తెలుగు సినిమా స్టామినా ని పెంచిన ఈ చిత్రం విడుదలై అప్పుడే నాలుగేళ్లు పూర్తిచేసుకుంది . 2015 జూలై 10 న బాహుబలి విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది . ప్రభాస్ , రానా , సత్యరాజ్ , అనుష్క , తమన్నా తదితరులు నటించిన బాహుబలి చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .
అత్యంత భారీ బడ్జెట్ తో బాహుబలి చిత్రాన్ని అందునా ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి . కట్ చేస్తే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ చరిత్ర సృష్టించింది . దాంతో రాజమౌళి కీర్తిప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తం అయ్యాయి . ఎం ఎం కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి , ఇక విజువల్స్ అదరహో అనిపించాయి దాంతో వసూళ్ల సునామీ సృష్టించింది . బాహుబలి కి నాలుగేళ్లు పూర్తికావడంతో ఆ చిత్ర బృందం చాలా జోష్ తో వేడుకలు జరుపుకుంది .