యంగ్ హీరో నాగశౌర్య కథ అందించి నటిస్తున్న చిత్రం `అశ్వథ్థామ`. ఐరా క్రియేషన్స్ బ్యానర్పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని డైరెక్టర్ పూరిజగన్నాథ్ విడుదల చేశారు.
`రాక్షసున్ని భగవంతుణ్ణి చూపిన కళ్లు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి. `ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేటకుక్కల్లా వెంటపడే జాలర్లు..శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందరినీ ఒకే స్టేజ్ మీద ఆడిస్తున్న సూత్రధారి ఎవరు? అని నాగశౌర్య చెబుతున్న డైలాగ్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అమ్మాయిల వరుస హత్యల మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ చాలా గ్రిప్పింగ్గా కనిపిస్తోంది. సినిమా బిట్ టు బిట్ ఇంట్రెస్టింగ్ సాగుతుందని తెలియజేప్తోంది. ఈ నెలాఖరున రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమాతో నాగశౌర్య హీరోగా, రచయితగానూ నూటికి నూరు శాతం సక్సెస్ కాబోతున్నట్టు అర్థమవుతోంది. ట్రెర్రిఫిక్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ సినిమా మాస్ ఇమేజ్ని అందిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.