Homeటాప్ స్టోరీస్కమల్ హాసన్ ను కలుసుకున్న లవ్ స్టోరీ నిర్మాతలు

కమల్ హాసన్ ను కలుసుకున్న లవ్ స్టోరీ నిర్మాతలు

కమల్ హాసన్ ను కలుసుకున్న లవ్ స్టోరీ నిర్మాతలు
కమల్ హాసన్ ను కలుసుకున్న లవ్ స్టోరీ నిర్మాతలు

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. నిన్న షూటింగ్ స్పాట్ వద్దకు లవ్ స్టోరీ నిర్మాతలు వచ్చారు. లవ్ స్టోరీ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ గ్రూప్ నిర్మించిన విషయం తెల్సిందే. నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

లవ్ స్టోరీ త్వరలోనే విడుదల కానుండగా ఏషియన్ సినిమాస్ మరిన్ని భారీ చిత్రాలను నిర్మించనున్నారు. ఇప్పటికే వారు ధనుష్ తో ప్యాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విషయం తెల్సిందే. దీంతో పాటు నాగ శౌర్య హీరోగా లక్ష్య, నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమాలను నిర్మిస్తున్నారు.

- Advertisement -

అయితే కమల్ హాసన్ ను కలవడం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని నిర్మాతలు తెలిపారు. కానీ కమల్ హాసన్ తో వారు సినిమాను ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి చూడాలి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All