అమ్రీన్ ఖురేషీ.. టాలీవుడ్, బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాదీ గర్ల్ అయిన అమ్రీన్ ఖురేషీ ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. తెలుగులో సూపర్ హిట్లుగా నిలిచిన సినిమా చూపిస్త మావ, జులాయి చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇందులో సినిమా చూపిస్తమావ చిత్రాన్ని `బ్యాడ్బాయ్` పేరుతో రాజ్కుమార్ సంతోషి రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ సాంగ్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో సందడి చేస్తోంది.
ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. రెండు రీమేక్ చిత్రాల ద్వారా బాలీవుడ్కు పరిచయం అవుతున్న అమ్రిన్ ఖురేషి చాలా కాన్ఫిడెంట్గా వుందట. `బ్యాడ్బాయ్` పేరుతో సినిమా `చూపిస్తమావ`ని రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లానని, తన టాలెంట్ చూసి అందులో అవకాశం ఇచ్చారని చెప్పింది. ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు రీమేక్ చిత్రాల ద్వారా బాలీవుడ్కు పరిచయం అవుతుండటం ఆనందంగా వుందని తెలిపింది.
నటనపై ఆసక్తి పెరగడానికి మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది. నటనలో వీరే నాకు స్ఫూర్తి అని తెలుగులో వీరి చిత్రాలు చూస్తూ పెరిగానని స్పష్టం చేసింది. తెలుగులో అవకాశం వస్తే అందరితో కలిసి నటిస్తానని మహేష్బాబు, రామ్చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కలిసి నటిస్తుందట. శ్రీదేవి బయోపిక్లో నటించే అవకాశం లభిస్తే అది నాకు లభించిన పెద్ద బాధ్యతగా భావిస్తాను అని తెలుగులో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.