అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అరుకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు , మాజీ ఎం ఎల్ ఏ సివేరి సోమలను కాల్చి చంపారు నక్సల్స్ . రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు జరిగింది . ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎం ఎల్ ఏ కిడారి సర్వేశ్వర్ రావు ప్రయాణిస్తున్న విషయాన్ని గమనించిన నక్సల్స్ ఒక్కసారిగా దాడి చేసి ఎం ఎల్ ఏ ప్రయాణిస్తున్న కార్లని అడ్డుకున్నారు . దాదాపు నలభై మంది నక్సల్స్ చుట్టుముట్టడంతో ఎం ఎల్ ఏ గన్ మెన్ లతో పాటుగా మాజీ ఎం ఎల్ ఏ గన్ మెన్ కూడా తన దగ్గర ఉన్న ఆయుధాలను ఇచ్చేసారు నక్సల్స్ హెచ్చరించడంతో .
ఆ తర్వాత ఎం ఎల్ ఏ కిడారి సర్వేశ్వర్ రావు తో పాటుగా మాజీ ఎం ఎల్ ఏ సివేరి సోమ లను కూడా కొద్దిదూరం తీసుకెళ్లారు . అక్కడ దాదాపు నలభై నిమిషాల పాటు జరిగిన వాగ్వాదం అనంతరం తొలుత మాజీ ఎం ఎల్ ఏ సోమని ఆ తర్వాత కిడారి సర్వేశ్వర్ రావు ని కిరాతకంగా కాల్చి చంపారు నక్సల్స్ . ఇద్దరు ప్రజా ప్రతినిధులను చంపారన్న విషయం రెండు రాష్ట్రాలలో దావానలంలా వ్యాపించింది . ఇక విదేశీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని మంత్రులను , ఉన్నతాధికారులను ఆదేశించాడు .
English Title: Araku mla kidari sarveshwar rao died maoist attack