ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏ ఆర్ రెహమాన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రెహమాన్ తల్లి కరీమా బేగం సోమవారం మృతి చెందారు. చెన్నైలోని నివాసం కరీమా బేగం తుది శ్వాస విడిచారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. తల్లి అకాల మరణంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. ఆయన తల్లి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తల్లి కరీమా బేగం చనిపోయిన కొంత సమయానికే ఆమె చిరునవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోని ఏ.ఆర్. రెహమాన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తండ్రి ఆర్.కె. శేఖర్ ..రెహమాన్ తొమ్మిదేళ్ల వయసులో వుండగానే మృతి చెందారు. తాజాగా తల్లి మరణంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. ఆర్. కె. శేఖర్, కరీమా దంపతులకు నలుగురు పిల్లలు. అందులో రెహమాన్ చిన్నవాడు. కరీమా బేగం వయసు కారణంగా ఏర్పడిన అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని చెబుతున్నారు.