Homeటాప్ స్టోరీస్చంద్రబాబు కు షాక్ ఇచ్చిన మోడీ

చంద్రబాబు కు షాక్ ఇచ్చిన మోడీ

ap cm shocked with pmతెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది , ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని , ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది . అయితే అవిశ్వాస పరీక్షలో మోడీ ప్రభుత్వం నెగ్గుతుందని తెలుగుదేశం పార్టీ కి ముందే తెలుసు అయినప్పటికీ కేంద్రం ఇచ్చిన హామీలను ప్రస్తావించి న్యాయం చేయమని మరోసారి కేంద్రాన్ని నిలదీయడానికే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు కానీ అనూహ్యంగా చంద్రబాబు కు మోడీ షాక్ ఇచ్చాడు .చంద్రబాబు కు పక్కలో బల్లెం లా ఉన్న జగన్ పార్టీ ఉచ్చులో చంద్రబాబు పడ్డాడని చెప్పడమే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షుడని అతడిపై పొగడ్తలు కురిపిస్తూ చంద్రబాబు ని మాత్రం పరోక్షంగా విమర్శలు చేసాడు మోడీ .

దాంతో షాక్ అవ్వడం చంద్రబాబు వంతయ్యింది . చంద్రబాబు కు పరిపాలనా దక్షుడని పేరుంది కానీ దాన్ని కేసీఆర్ కు ఆపాదిస్తూ బాబు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నదేమి లేదని బాబు ని తక్కువగా చేసి చూపించాడు మోడీ . అంతేకాదు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాన్ని మర్చిపోవాలని , ప్రత్యేక ప్యాకేజి కి ఒప్పుకుంది చంద్రబాబే అంటూ అతడిపైనే నిందలు వేసాడు . ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడింది తక్కువే అందునా హామీల గురించి , అమలు గురించి అసలు మాట్లాడలేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం అని మాత్రం చెప్పాడు . సహకరిస్తాం అని అంటున్నారు కానీ నిధులు ఇవ్వడం లేదని బాబు ప్రభుత్వం ఆరోపిస్తోంది . మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానం వల్ల కేంద్రం నుండి సానుకూల వైఖరి వస్తుందని భావించిన వాళ్లకు నిరాశే ఎదురయ్యింది .

- Advertisement -

English Title: ap cm shocked with pm

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All