జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నట్లే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని అమ్ముకోవడం ఖాయమని , ఇప్పటికే అమ్మకానికి పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు చంద్రబాబు . అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులతో రాబోయే ఎన్నికల గురించి చర్చించిన బాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసాడు . గత ఎన్నికల్లో మనకు మద్దతు ఇచ్చిన పవన్ కేంద్రం ఆడిస్తున్నట్లుగా ఆడుతూ మనపై లేనిపోని విమర్శలు చేస్తూ తానే ప్రజల్లో పలుచన అవుతున్నాడని , 2019 లో జరిగే ఎన్నికల్లో మనమే ఘనవిజయం సాధించబోతున్నామని తెలిపాడు .
రకరకాల సర్వేలు ప్రచారంలో ఉన్నాయని కానీ అవేవి నిజం కాదని ఎందుకంటే 2019 లో మళ్ళీ మనమే అధికారం చేపట్టొబోతున్నామని అయితే ఎలాగూ అధికారంలోకి రాబోతున్నాం కదా అనే అలసత్వం పనికి రాదని అందరూ అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేసాడు చంద్రబాబు . 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఘోర పరాజయం పొందాడు . అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజారాజ్యం ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయిన విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ ఏమో 2019 లో నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటున్నాడు . జనసేన మాత్రం కొంత వరకు ప్రభావం చూపుతుందేమో కానీ సంస్థాగతంగా బలోపేతం కాలేదు దాంతో జనసేన పై నీలినీడలు కమ్ముకున్నాయి . దానికి తోడు ఎంతసేపు చంద్రబాబు ని విమర్శిస్తున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వంపై కానీ ప్రధాని మోడీ పై కానీ అసలు విమర్శలు చేయడం లేదు పవన్ దాంతో జనసేన ని బిజెపి కి అమ్మినట్లే అని ప్రచారం సాగుతోంది .
English Title: AP CM Chandrababu naidu sensational comments on Pawan kalyan