Homeటాప్ స్టోరీస్అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన విరుష్క జోడీ!

అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన విరుష్క జోడీ!

Anushka sharma shares good news
Anushka sharma shares good news

అనుష్క‌, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పారు. త్వ‌ర‌లో తామిద్ద‌రం పేరెంట్స్ కాబోతున్నామ‌ని గుడ్ న్యూస్ చెప్పేశారు. గ‌త కొంత కాలంగా అనుష్క ప్రెగ్నెంట్ అంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించ‌డం, అందులో ఎలాంటి నిజం లేద‌ని అనుష్క‌, విరాట్ లు క్లారిటీ ఇవ్వ‌డం తెలిసిందే. అయితే తాజాగా గురువారం అనుష్క శ‌ర్మ ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్‌ని చెప్పేసింది.

దీంతో ఈ జంట‌కు అభిమానులు, సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ మొద‌లైంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇక్క‌డే ఓ చ‌ర్చ మొద‌లైంది. విరాట్ కోహ్లీ, ఇంత‌కీ విరుష్కా జోడీకి పుట్ట‌బోయేది అమ్మాయా? అబ్బాయా? అని చ‌ర్చించ‌డం మొద‌లైంది. అనుష్క శ‌ర్మ త‌ను త‌ల్లి కాబోతున్నాన‌ని ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించిన మ‌రుక్ష‌ణ‌మే ఆ వార్త వైర‌ల్‌గా మారిపోయింది.

- Advertisement -

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ 2017లో వివాహం చేసుకున్నారు. అంటే వీరి వివాహం జ‌రిగి మూడేళ్ల‌వుతోంది.  ఇంకా వీరి నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడొస్తుందా అని చాలా మంది సెల‌బ్రిటీలు అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా అనుష్క గుడ్ న్యూస్ చెప్ప‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రితో అనుష్క శ‌ర్మ ఓ పండంటి పాప‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All