ప్రభాస్ – అనుష్కల గురించి చాలా రోజులుగా ఓ చర్చ జరుగుతోంది. త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, అనుష్క మదర్ కూడా అనుష్కకు ఆ మధ్య ప్రభాస్ లాంటి వరుడు కావాలని వెల్లడించడంతో ఈ ఇద్దరిపై పుకార్లు షికారు చేయడం మొదలైంది. ఈ పుకార్లపై ఇప్పటి వరకు ప్రభాస్ కానీ అనుష్క కానీ స్పందించలేదు. దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా అలాంటి చర్చే ట్విట్టర్ వేదికగా జరిగింది.
అనుష్క నటించిన `నిశ్శబ్దం` ఇటీవల అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అనుష్క అభిమానులతో చిన్న పాట చిట్ చాట్ చేసింది. పలు ప్రశ్నలు సంధించిన అభిమానులకు అనుష్క చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. అంతలో ఓ అభిమాని `మిర్చీ` చిత్రంలో పెళ్లి పీటలపై చర్చించుకుంటున్న ప్రభాస్, అనుష్కల ఫొటోని ట్వీట్ చేసి దీనిపై మీ కామెంట్ ఏంటని అడిగాడు.
దీనికి అనుష్క తెలివిగా సమాధానం చెప్పింది. `మిర్చి` పోస్టర్ డిజైన్ కోసం ఆ క్యాండిడ్ ఫొటో దిగామని, ఇది తన మనసుకు చాలా దగ్గరైన చిత్రమని, యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన తొలి చిత్రమిదని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేసింది. దీంతో మరోసారి ప్రభాస్ టాపిక్ని అవైడ్ చేసినట్టు స్పష్టమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.