సుశాంత్ మృతిపై స్వీటీ అనుష్క భావోద్వేగ సందేశాన్ని అందించింది. సోషియల్ మీడియా ఇన్స్టా వేదికగా అనుష్క పెట్టిన పోస్ట్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. బాధల్ని పంచుకోవాలని, ఇతరుల మాటల్ని వినాలని అనుష్క స్పష్టం చేశారు.
ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదని, మనమంతా మనకు తెలిసిన విధంగా జీవితం లో సమస్యల్ని పరిష్కరించుకుంటామని, ఇదే సరైన మార్గం .. ఇదే సరికాని మార్గం అంటూ ఏమీ లేవని, మనమంతా రోడ్డు మ్యాపుతో పుట్టలేదని, మనకు సరైన మార్గంలో ముందుకు సాగుతున్నామని పేర్కొంది.
కొందరు సాయం కోసం బయటపడి ఏడుస్తుంటారు .. కొందరు లో లోనే మదనపడుతుంటారు. మనమంతా ఇంకా ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇంకా దయతో జీవిద్దాం. ఇతరుల మాటల్ని విందాం . మార్పు అనేది నెమ్మదిగా మొదలవుతుంది’ అని అనుష్క భావోద్వేగ సందేశాన్ని అందించింది.