గత కొంత కొంత కాలంగా అనుపమ పరమేశ్వరన్ దూరంగా ఉంటోంది దానికి కారణం ఆమె బాధతో వుండటమేనని తెలిసింది. తాజాగా తన బాధకు గల కారణాన్ని వివరిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. విచిత్ర మైన వైరస్ కారణంగా తన పెపుడు కుక్కలు మృతిచెందాయని వెల్లడించింది.
అనుపమా పరమేశ్వరన్ పెంచుకుంటున్న మూడు కుక్కలు పార్వో వైరస్ బారిన పది చనిపోవడం ఆమెని కలిచివేసిందట. దీనితో అనుపమ తీవ్ర ఆవేదనకు గురైందని తెలిసింది. ఈ సందర్భంగా ఆమె రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది.
‘నేను అడాప్ట్ చేసుకున్న విస్కీ , రమ్మీ, టోడి ల్లో రెండు పార్వో వైరస్ బారినపడి చనిపోయాయని ఎం జరుగుతుందో తెలుసుకునే లోపు మాయదారి వైరస్ కారణంగా మృతి చెందాయని, చివరికి ఒకటి మాత్రమే మిగిలిందని, ఈ వైరస్ నుంచి మూగ జీవాలను రక్షించండి ‘ అంటూ వీడియో సందేశాన్ని అందించింది.
- Advertisement -