యువ హీరో నిఖిల్ గతేడాది అర్జున్ సురవరం చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ప్లాపులకు బ్రేక్ వేసాడు. ఇక ఈ ఏడాది కాస్త గ్యాప్ తీసుకుని వరసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి కార్తికేయ 2 కాగా మరొకటి 18 పేజెస్. సుకుమార్, అల్లు అరవింద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న.
ఈ చిత్రంలో హీరోకు మెమరీ లాస్ ఉంటుందిట. అయితే ఆ పాయింట్ ను కూడా సరికొత్తగా ప్రెజంట్ చేయబోతున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే మెమరీ లాస్ ప్రేక్షకులకు ఒక షాక్ ఫ్యాక్టర్ ను ఇస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ముందు నుండీ అనుపమ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఎట్టకేలకు అది దూరమైంది. ఆఫర్లకోసం ఎదురుచూస్తోన్న అనుపమకు ఇది నిజంగా సూపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.