కొంత మందికి బంపర్ ఆఫర్స్ లభించినా కాలం కలిసి రాకపోతే ఎలాంటి ఆఫరైనా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నాని నటించిన `మజ్ను` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. కరళలో పుట్టినా అమెరికాలో సెటిల్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో రాణించాలని పట్టుదలతో తిరిగి మళ్లీ ఇండియా వచ్చి మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది.
తెలుగులో తొలి సినిమా `మజ్ను` విజయం తరువాత వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంది. 2017 నుంచి 2018 వరకు అను చేసిన ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు.. చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర పరజయాన్ని చవిచూశాయి. గోపీచంద్, పవర్స్టార్ పవర్కల్యాణ్, నాగచైతన్య, అల్లు అర్జున్ వంటి క్రేజీ హీరోలతో చేసిన చిత్రాలేవీ హిట్ కాకపోవడంతో అనుకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. తమిళ్కి వెళ్లిపోయింది.
తాజాగా అను ఇమ్మాన్యుయేల్కు మరో ఆఫర్ తగిలింగి. లెక్కల మాస్టారు సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్న చిత్రం `18 పేజెస్`. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ 2 బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. నిఖిల్కు జోడీగా కృతి శెట్టి నటించే అవకాశం వుందని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ నటించనున్నట్టు తెలిసింది. మరి ఈ సినిమా అయినా అనుని గట్టెక్కించాలని, తెలుగులో మళ్లీ ఆమె వరుస చిత్రాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.