Homeటాప్ స్టోరీస్ఎందుకు పాటతో మళ్లీ చిచ్చు పెట్టాడు

ఎందుకు పాటతో మళ్లీ చిచ్చు పెట్టాడు

Another controversy song from lakshmi 's ntrఎందుకు అనే పాటని తాజాగా విడుదల చేసి మళ్లీ చిచ్చు రేపుతున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎన్టీఆర్ బయోపిక్ రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రం ఎందుకు అనే పాట ని యూట్యూబ్ లో విడుదల చేశాడు. ఆ పాటలో ఎన్టీఆర్ , లక్ష్మీ పార్వతిల ఫోటోలతో పాటుగా చంద్రబాబు , దగ్గుబాటి వెంకటేశ్వర రావు , బాలకృష్ణ , హరికృష్ణ , పురంధేశ్వరి , భువనేశ్వరి ఫోటోలను కూడా వాడాడు వర్మ .

అంతేకాదు శ్రీదేవి , జయసుధ , జయప్రద లాంటి అందగత్తె లున్నప్పటికి వాళ్ళని కాదని , తన కుటుంబ సభ్యులను కాదని , యావత్ తెలుగు ప్రజలను కాదని లక్ష్మీ పార్వతి ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ ని అంతగా ఆకర్షించిన లక్ష్మీ పార్వతి ని అధికారం పోతుందని తెలిసినా ఎందుకు విడిచిపెట్టలేదు అని ప్రశ్నిస్తూ సాగే పాట తప్పకుండా బాలయ్య అభిమానులతో పాటుగా తెలుగుదేశం శ్రేణులను ఆవేశానికి లోనయ్యేలా రూపొందించాడు వర్మ. అసలు ఈ సినిమా షూటింగ్ సంగతి దేవుడెరుగు వివాదాలు మాత్రం బాగానే రాజేస్తున్నాడు వర్మ లక్ష్మీ స్ ఎన్టీఆర్ అని .

- Advertisement -

English Title: Another controversy song from lakshmi ‘s ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All