Homeటాప్ స్టోరీస్ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!

ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!

ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!
ప్రిన్స్ అభిమానులకి దీపావళి ట్రీట్! వచ్చే నెల ఐటెం సాంగ్ కూడా!

దర్శకులు ‘అనిల్ రావిపూడి‘ గారు ఇప్పటి వరకు చేసిన 4 సినిమాలు ఒక ఎత్తు అయితే మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమాకోసం ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు……సినిమా పేరు ‘సరిలేరు నీకెవ్వరూ‘ అని మనకి తెలుసు. మహేష్ బాబు ని ఇప్పటివరకు ఎవరు చూపియ్యని ఆర్మీ మేజర్ పాత్రలో చూపించి ధైర్యం చేస్తున్నారు అనిల్ గారు. సినిమాకి పోటీగా వచ్చే సంక్రాంతికి 4 సినిమాలు పోటీపడుతున్నాయి.

అనిల్ సుంకర, దిల్ రాజు, మాహేష్ బాబు ముగ్గురు కలిసి తమ సొంత బ్యానర్ లో సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘రష్మిక మందన్న’ కథానాయికగా మొదటి సారి మహేష్ బాబు గారితో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో విజయశాంతి గారు, రాజేంద్ర ప్రసాద్, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజు, బండ్ల గణేష్, సంగీత, హరితేజ, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ  లాంటి పెద్ద తారాగణం నటిస్తున్నారు. సినిమాలో చిన్న లోపం కూడా లేకుండా ప్రతి సీన్ ని దగ్గరుండి మరీ తెరెకెక్కిస్తున్నారు దర్శకులు అనిల్ రావిపూడి గారు. అయితే సినిమా నుండి కొత్తగా ఒక పోస్టర్ బయటికి వచ్చింది.

- Advertisement -

దర్శకులు తన ట్విట్టర్ ద్వారా ‘సినిమా మొత్తానికి షూటింగ్ అయిపోవడానికి వచ్చింది. విలన్ హౌస్ షెడ్యూల్ ముగించుకొని చివరి షెడ్యూల్ కోసం మేము సిద్ధం అవుతున్నాము. దీపావళి ట్రీట్ కోసం మీరు సిద్ధంగా ఉండండి’ అని అన్నారు. అయితే దీపావళి పండగకి ప్రిన్స్ అభిమానులకి ఒక పాట గాని లేక ఇంకొక టీజర్ కానీ, ఇదంతా కుదరదు అని విజయశాంతి గారి ఫోటో ఉన్న పోస్టర్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు నటిస్తున్న సినిమా కనుక ఈ సారి అలా అయిన పోస్టర్ రిలీజ్ ఉండొచ్చు అనుకుంటున్నారు.

ఇక పోతే ఈ సినిమాలో తమన్నా తో ఐటెం సాంగ్ చేయిద్దాం అనుకున్న అనిల్ రావిపూడి గారు. ఈ చివరి షెడ్యూల్ లో తమన్నా కోసం ప్రత్యేకంగా ఒక 1970 కాలంనాటి ఆర్మీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక అద్భుతమైన పాటని అనుకుంటున్న అనిల్ గారికి దేవి శ్రీ ప్రసాద్ గారు ఒక  మంచి పాటని వినిపించారు. ఈ చివరి షెడ్యూల్ లోనే ‘పూజహెగ్డే’ తో ఇంట్రడక్షన్ పాట కూడా ఒకటి షూట్ చెయ్యాలి అని నృత్యదర్శకులకి చెప్పాడు అనిల్ రావిపూడి గారు. ఇక చూసుకుంటే సంక్రాంతి పోటీకి ఏ మాత్రం తగ్గకుండా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాని జాగ్రత్తగా అనిల్ రావిపూడి గారు సిద్ధం చేస్తున్నారు.

సినిమాలో కథానాయికల పరంగా లోటు లేకుండా ముగ్గురుని ఎంచుకోవడం. మహేష్ బాబు గారిని కొత్తగా చూపించడం, విజయశాంతి గారి నటన, యాక్షన్ , కామెడీ, ఐటెం సాంగ్స్ ఇవన్నీ కలిసి సినిమాని మహేష్ అభిమానులు ఆకాశానికి లేపడం ఖాయమని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All