విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ తొలి కాంబినేషన్లో వచ్చిన చిత్రం `ఎఫ్ 2`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి వంద కోట్ల క్లబ్లో సునాయాసంగా చేరిపోయి ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ని చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
లాక్డౌన్ పిరియడ్లో `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్3` స్క్రిప్ట్ని దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి చేశారట. ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించారు కూడా. `ఎఫ్2`కి భిన్నంగా సాగే ఈ సీక్వెల్లో తొలి భాగంలో నటించిన హీరోలు వెంకటేష్, వరున్తేజ్, హీరోయిన్లు తమన్నా, మెహరీన్ తో పాటు మిగతా నటులంతా వుంటారని వెల్లడించిన అనిల్ రావిపూడి సీక్వెల్ మాత్రం మరింత కొత్తగా వుంటుందని వెల్లడించారు.
ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని హరీబరీగా మొదలుపెట్టాలనే ఆలోచన తనకు లేదని, నిదానంగా వచ్చే ఏడాది చూద్దాంలే అని హీరో వెంకటేష్ అన్నట్టు తెలిసింది. ప్రస్తుతం వెంకటేష్ తమిళ హిట్ చిత్రం `అసురన్` ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి, ప్రకాష్రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.