Homeగాసిప్స్`స‌ర్కారువారి పాట` కోసం మిస్ట‌ర్ ఇండియా?

`స‌ర్కారువారి పాట` కోసం మిస్ట‌ర్ ఇండియా?

`స‌ర్కారువారి పాట` కోసం మిస్ట‌ర్ ఇండియా?
`స‌ర్కారువారి పాట` కోసం మిస్ట‌ర్ ఇండియా?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` మూవీతో ఈ ఏడాది ప్రారంభంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకున్నారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌. ఈ మూవీ త‌రువాత ఆయ‌న చేస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీమూవీమేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టించ‌నున్న ఈ మూవీలో మ‌హేష్ డ్యుయెల్ రోల్‌లో క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో స్టార్ట్ కాబోతోంది. ఇదిలా వుంటే ఇందులో విల‌న్ వైట్ కాల‌ర్ నేర‌గాడిగా వేల కోట్లు బ్యాకుల‌కు ఎగ‌వేసిన వ్య‌క్తిగా చూపించ‌బోతున్నారు.

- Advertisement -

ఈ పాత్ర కోసం అర‌వింద స్వామి అడిగారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరో అనిల్ క‌పూర్‌ని చిత్ర బృందం సంప్ర‌దించింద‌ట‌. ఇందుకు `మిస్ట‌ర్ ఇండియా` అనిల్ క‌పూర్ 10 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి మేక‌ర్స్ అనిల్ క‌పూర్ డిమాండ్‌ని అంగీక‌రిస్తారా?  లేదా అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే. జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All