Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌?

ప‌వ‌న్ చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌?

ప‌వ‌న్ చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌?
ప‌వ‌న్ చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జగర్లాముడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న  ప్రాజెక్టులో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ పునః ప్రారంభ‌మైంది. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. `వకీల్ సాబ్` చిత్రాన్ని ఇటీవ‌లే పూర్తి చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌లే క్రిష చిత్రాన్ని ప్రారంభించారు.

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంస‌ల్ విల‌ణ్గా న‌టిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో అన‌సూయ కూడా న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రంలో అనసూయ ఒక ప్రత్యేక పాటలో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ప‌వ‌న్ న‌టించిన `అత్తారింటికి దారేది` చిత్రంలోని `ఓరి దేవుడో దేవుడో ఏం పిల్ల‌గాడే..` పాట‌లో న‌టించే అవ‌కాశం ముందు అన‌సూయ‌కే వ‌చ్చింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ అవ‌కాశాన్ని అన‌సూయ వ‌దులుకుంది.

- Advertisement -

అప్పుడు మిస్స‌యిన అద‌ష్టం అన‌సూయ‌ని మ‌రోసారి కి్ర‌ష్ మూవీ కూపంలో త‌లుపు త‌ట్ట‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ప్రస్తుతం అన‌సూయ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుంది. ఇదే ఏడాది తమిళ, మలయాళ భాషల్లోనూ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ రేన‌థ్యంలో అన‌సూయ‌కు ప‌వ‌న్ పాన్ ఇండియా చిత్రంలో ప్ర‌త్యేక పాట‌లో న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All