పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జగర్లాముడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభమైంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. `వకీల్ సాబ్` చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసిన పవన్కల్యాణ్ ఇటీవలే క్రిష చిత్రాన్ని ప్రారంభించారు.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంసల్ విలణ్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో అనసూయ కూడా నటించనున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో అనసూయ ఒక ప్రత్యేక పాటలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ నటించిన `అత్తారింటికి దారేది` చిత్రంలోని `ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే..` పాటలో నటించే అవకాశం ముందు అనసూయకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని అనసూయ వదులుకుంది.
అప్పుడు మిస్సయిన అదష్టం అనసూయని మరోసారి కి్రష్ మూవీ కూపంలో తలుపు తట్టడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ప్రస్తుతం అనసూయ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇదే ఏడాది తమిళ, మలయాళ భాషల్లోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ రేనథ్యంలో అనసూయకు పవన్ పాన్ ఇండియా చిత్రంలో ప్రత్యేక పాటలో నటించే అవకాశం దక్కడం విశేషం.