రామ్చరణ్ నటించిన చిత్రం `రంగస్థలం`. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రంగమ్మత్తగా కీలక పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది అనసూయ. ఇందులో ఆమె అభినయానికి గానూ విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారంతో పాటు మరో రెండు పురస్కారాల్ని సైతం సొంతం చేసుకుంది. మరోసారి అంతకు మించిన పాత్రలో అనసూయ కనిపించబోతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. రష్మి మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో అనసూయ కనిపించబోతోంది.
ఈ బుధవారం నుంచే అనసూయ సెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే రోజు ఆమెపై కొన్ని కీలక ఘట్టాలని చిత్రీకరించారు సుకుమార్. ఈ సందర్భంగా `పుష్ప` సెట్లో క్లాప్ బోర్డ్ పట్టుకున్న ఫొటోని షేర్ చేసింది అనసూయ. `రంగస్థలం`లో అనసూయని రంగమ్మత్తగా ప్రజెంట్ చేసిన సుకుమార్ `పుష్ప`లో ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
View this post on Instagram