Homeటాప్ స్టోరీస్సోషల్ మీడియా పై నిప్పులు కక్కిన అనసూయ

సోషల్ మీడియా పై నిప్పులు కక్కిన అనసూయ

Anasuya fires on netizensహాట్ భామ అనసూయ సోషల్ మీడియా లో తనపై వస్తున్న కథనాలపై నిప్పులు కక్కింది. యు ట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మా లాంటి వాళ్లపై అనవసరమైన , నిరాధారమైన వార్తలను రాస్తూ సొమ్ము చేసుకుంటున్నారని , అలా రాసే తప్పుడు రాతల వల్ల మా కుటుంబం బాధపడుతుందని కనీస జ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు రాసే రాతల వల్ల మా కుటుంబం రోడ్డున పడితే మమ్మల్ని పోషించేది ఎవరు ? మీలాగా బ్రతకాలన్నా కూడా కుదరదు ? అలాంటప్పుడు మేము ఏ ఉద్యోగం చేసుకోవాలి అంటూ నిప్పులు చేరుగుతోంది అనసూయ.

జబర్దస్త్ ప్రోగ్రాం తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ పై యూ ట్యూబ్ ఛానల్ లలో అలాగే కొన్ని వెబ్ సైట్ లలో ఘోరంగా రాస్తున్నారు. ఇక యూ ట్యూబ్ లో అయితే మరీ దారుణంగా అనసూయ పై కథనాలు వండి వారుస్తున్నారు. ఆ కథనాలు అనసూయ కంట పడటంతో ఆవేశానికి లోనయ్యింది. ఇక ఫేస్ బుక్ , వాట్సాప్ , ట్విట్టర్ లలో అయితే అనసూయ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ భామ బుల్లితెర పై అందాలను ఆరబోస్తూ కుర్రకారు కి నిద్ర లేకుండా చేస్తుండటంతో రాతలకు అంతేకాకుండా పోయింది. దాంతో అనసూయ కుటుంబం కూడా చాలా బాధపడుతోందట . అందుకే అనసూయ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

- Advertisement -

English Title: anasuya fires on netizens

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All