బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ని గత రెండు నెలలుగా కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పరిగణిస్తూ సుశాంత్ కుటుంబం సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయడం ఆ తరువాత బీహార్ ముఖ్యమంత్రి ఈ కేసుని సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని కోరడంతో కేంద్రం, సుప్రీమ్ కోర్టు కూడా ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైనట్టు తెలుస్తోంది.
ఇదిలా వుంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇందులో పాక్కు చెందిన నటుడు కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని పాక్ కు చెందిన నటుడు హసన్ ఖాన్ ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలని కూడా షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
నా హృదయానికి చాలా దగ్గరగా భావించే ఓ ప్రాజెక్ట్ని తాజాగా అంగీకరించారు. అందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పాత్రలో నటిస్తున్నాను. ఇది ఓ ఇండియన్ వెబ్ సిరీస్` అని హసన్ ఖాన్ వెల్లడించాడు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వార్తలని అమెజాన్ ప్రైమ్ ఖండించింది. తాము సుశాంత్ పై ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదని, ఇప్పటి వరకు ఏ నటుడినీ ఎంపిక చేయలేదని వెల్లడించింది.