`ఏబీసీడీ` మూవీ తరువాత అల్లు శిరీష్ కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయలేదు. ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్నది కూడా క్లారిటీ లేదు. దీంతో ఆయన కొత్త సినిమా మరింత ఆలస్యం కావడం ఖాయమేనా అని వార్తలు జోరందుకున్నాయి. శిరీష్ పక్కన వుండగా గీతా ఆర్ట్స్, జీఏ2 పిక్చర్స్ బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాయి ఏంటీ అని ప్రాచారం కూడా మొదలైంది.
అయితే ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ అల్లు శిరీష్ తన కొత్త ప్రాజెక్ట్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించినట్టు తెలిసింది. నిఖిల్ `కార్తికేయ 2` ప్రారంభమైన మార్చి 2నే శిరీష్ కొత్త సినిమా ముహూర్తం జరుపుకుంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ నెల 16 నుంచి మొదలుపెట్టబోతున్నారట. ఓ రొమాంటిక్ లవ్స్టోరీగా ఈ సినిమా వుంటుందని తెలిసింది.
కల్యాణ్దేవ్తో `విజేత` చిత్రాన్ని చేసిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో అల్లు శిరీష్కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించనుందని, ఇప్పటికే ఆమెని చిత్ర వర్గాలు ఫైనల్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర బృందం వెల్లడించనుందట.