మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తన పెళ్లి గురించి మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాయని కామెంట్ చేసిన సాయిధరమ్తేజ్ ఇటీవల నిహారిక పెళ్లి తరువాత తను పెళ్లి చేసుకుంటానని వెల్లడించాడు.
తాజగా నిహారిక వివాహం ఈ నెల 9న రాజస్థాన్ ఉదయ్పూర్ లోని ఉదయ్ విలాస్లో గుంటూరుకు చెందిన ఐజీ ప్రభాకర్రావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీస్ అన్ని హాజరై ఉదయ్విలాస్లో సందడి చేశాయి. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవన్కల్యాణ్, అల్లు అరవింద్, రామ్చరణ్, వరుణ్తేజ్, సాయి ధరమ్తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్తేజ్ అంతా కలిసి ఆడిపాడారు.
ఇదిలా వుంటే నిహారిక పెళ్లి తరువాత తన పెళ్లంటూ చెప్పిన సాయిధరమ్తేజ్ తాజాగా మాటమార్చినన విషయం తెలిసిందే. అల్లు శిరీష్ తనకంటే పెద్ద వాడని అతని పెళ్లి తరువాతే తన పెళ్లంటూ కొత్త లాజిక్ చెప్పుకొచ్చారు. అయితే తేజ్ వ్యాఖ్యలతో శిరీష్ పెళ్లి కాబోతోందంటూ ప్రచారం మొదలైంది. దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు. తేజు సరదాగా తన పేరు చెప్పాడని, తన పెళ్లి విషయంలో పేరెంట్స్ ఎలాంటి వొత్తిడి చేయడం లేదని, మరి కొంత కాలం బ్యాచిలర్ లైఫ్నే కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో తేజ్ ఏమంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
Hahahaha. What!!! No. I’m sure Tej meant it as a joke and all you guys took it too seriously. My parents are chill abt me being single. Whenever I decide to get married I’ll tell you all myself. https://t.co/xkhWpctwDH
— Allu Sirish (@AlluSirish) December 17, 2020