అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. స్టార్ హీరో ప్రభాస్తో ఈ ఛాలెంజ్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పలువురు తారలు మొక్కలు నాటి మరి కొంత మందిని ఈ ఛాలెంజ్లో భాగం కావాలని నామినేట్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడమే కాకుండా కొంత మందిని ఈ ఛాలెంజ్లో పాల్గొనలాని ఛాలెంజ్ విసిరారు.
విశ్వక్ సేన్ ఛాలెంజ్ విసిరిన వాళ్లలో హీరో అల్లు శిరీష్ కూడా వున్నారు. విశ్వక్సేన్ ఛాలెంజ్ని శనివారం స్వీకరించిన అల్లు శిరీష్ తన ఇంటి గార్డెన్ ఏరియాలో మూడు మొక్కలని నాటారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ `ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరం. అందుకే విధిగా మనందరం మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా విశ్వక్సేన్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్కి నా మేనల్లుడు ఆర్నావ్, మేనకోడల్లు అన్విత, సమారా, నివ్రితిలను నామినేట్ చేస్తున్నాను` అన్నారు.
రానున్న తరానికి చెట్లను ఏవిధంగా నాటాలి, ఎలా పెంచాలి అనే విషయం తెలియడం చాలా అవసరం.అందుకే మా పిల్లలని నామినేట్ చేశానని అన్నారు. అల్లు శిరీష్ ప్రస్తుతం తన కొత్త సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.