`గమ్యం`తో ప్రశంసలందుకున్న క్రిష్ విభిన్నమైన స్క్రీన్ప్లేతో సరికొత్త పాయింట్తో ఆవిష్కరించిన చిత్రం `వేదం`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటించిన చిత్రమిది. అనుష్క వేశ్య పాత్రలోనూ, హీరో మంచు మనోజ్ రాక్స్టార్గానూ కనిపించారు.
భిన్నమైన ఐదుగురి జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో స్క్రీన్ప్లే ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. 2010 జూన్ 4న ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది. ఈ మూవీ విడుదలై నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
నా కెరీర్లో `వేదం` ఒక అద్భుతమైన ప్రయాణం. ఇందులో తనకు అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్తో పాటు తనతో పాటు కలిసి నటించిన హీరో మంచు మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్పాయ్లకు ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.