పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో రివేంజ్ డ్రామాగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించడం విశేషం. ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా . సముద్రఖని , రావు రమేష్ , మురళి శర్మ లు ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ సినిమాను చూసిన అభిమానులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున పవన్, రానా నటన ఫై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ తరుణంలో నిన్న ఈ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. `భీమ్లా నాయక్` ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. బన్నీ ఇలా సినిమా చూడటం వరకూ బాగానే ఉంది. ఇప్పుడా సినిమాని ఉద్దేశించి ట్విటర్లో ఏదైనా కామెంట్ పెడతారా? రివ్యూ ఏదైనా ఇస్తారా? అని అభిమానులు రాత్రి నుండి ఎదురుచూస్తున్నారు. మరి బన్నీ ఎప్పుడు ట్వీట్ చేస్తాడో చూడాలి.