ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సొంత సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుష్ప పూర్తైన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటి అనే విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ తొలగిపోలేదు. ఎందుకంటే కొరటాల శివతో సినిమా అనౌన్స్మెంట్ జరిగింది కానీ అది షూటింగ్ దశకు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.
ఈ లాక్ డౌన్ సమయంలో అల్లు అర్జున్ కథలు వింటున్నాడు. పుష్ప తర్వాత చేయబోయే చిత్రంపై ఒక క్లారిటీ తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. రీసెంట్ గా బోయపాటి శ్రీను కలిసి ఒక పవర్ఫుల్ కథను చెప్పాడు. బన్నీకి కూడా నచ్చింది. గీతా ఆర్ట్స్ ను నిర్మించమని అడిగాడు. అంతా పాజిటివ్ గా ఉంది.
అయితే సినిమాల లైనప్ విషయంలోనే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. పుష్ప తర్వాత వెంటనే బోయపాటి చిత్రం ఉంటుందా లేక మరో సినిమా లైన్లోకి వస్తుందా అన్నది చూడాలి.