Homeటాప్ స్టోరీస్ప్రామిస్ నిల‌బెట్టుకున్న త‌మ‌న్‌!

ప్రామిస్ నిల‌బెట్టుకున్న త‌మ‌న్‌!

ప్రామిస్ నిల‌బెట్టుకున్న త‌మ‌న్‌!
ప్రామిస్ నిల‌బెట్టుకున్న త‌మ‌న్‌!

అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్. రాధాకృష్ణ‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

మ్యూజిక‌ల్‌గానూ స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలోని .`.సామ‌జ వ‌ర‌గ‌మ‌న.., ..రాములో.. రాములా…, బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..` గీతాలు యూట్యూబ్‌లో హండ్రెడ్ మిలియ‌న్ వ్యూస్ దాటి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అయితే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్‌కి ముందే అల్లు అర్జున్ ఈ చిత్రంలోని పాట‌లు చార్టుబ‌స్ట‌ర్స్‌లో నిల‌వాల‌ని, బిలియ‌న్స్ మంది ఈ పాట‌ల్ని ప్లే చేయాల‌ని చెప్పాడ‌ట‌. అలాగే చేస్తాన‌ని త‌మ‌న్ ప్రామిస్ చేశాడ‌ట‌.

- Advertisement -

తాజాగా ఆ ప్రామిస్‌ని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశాడు. `నా ప్రియ‌మైన త‌మ‌న్ నాకు చాలా గ‌ర్వంగా వుంది. నాకు చెప్పిన మాట‌ల్ని నిజం చేసి చూపించావు. చార్టు బ‌స్ట‌ర్స్‌లో నా ఆల్బ‌మ్ నిల‌వాల‌ని, బిలియ‌న్స్ మంది ఈ పాట‌ల్ని ప్లే చేయాల‌ని `అల వైకుంఠ‌పుర‌ములో` స్టార్టింగ్‌కి ముందు చెప్పా. దానికి ఓకే బ్ర‌ద‌ర్ అని ప్రామిస్ చేసి ఈ రోజు దాన్ని నిజం చేసి చూపించాడు. ఈ రోజు ఈ చిత్రంలోని పాట‌లు ఈరోజుకి 1.13 మిలియ‌న్ వ్యూస్ దాటింది` అని బ‌న్నీ ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All