Homeటాప్ స్టోరీస్వైజాగ్ ఆర్ కె బీచ్ లో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా "నా...

వైజాగ్ ఆర్ కె బీచ్ లో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా “నా పేరు సూర్య ” సైకత శిల్పం

allu arjun sand statue in vizagస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా వైజాగ్ ఆర్ కె బీచ్ లో వేసిన సైకత శిల్పం చూపరుల్ని విశేషం గా ఆకట్టుకునేలా 5 ఫీట్ ఎత్తు లో… 30 ఫీట్లలో తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సైకత శిల్పి మానస్ శేషు ఆధ్వర్యంలో ఈ సాండ్ ఆర్ట్ వేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు సైకత శిల్పాన్ని చూసి పండగ చేసుకుంటారు. అల్లు అర్జున్ కి అభిమానులు ఇస్తున్న అందమైన కానుక అని సైకత శిల్పి అన్నారు. ఈ సందర్భంగా రేపు సాయంత్రం (7వ తేదీ) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి… ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా… వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ… గ్రాండియర్ గా “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా హీరో ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసిందే. బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది.

వైజాగ్ ఆర్ కె బీచ్ లో 5 ఫీట్ ఎత్తు లో… 30 ఫీట్లలో రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సైకత శిల్పి మానస్ శేషు ఆధ్వర్యంలో సాండ్ ఆర్ట్ వేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు సైకత శిల్పాన్ని చూసి పండగ చేసుకునెలా తయారు చేస్తున్నారు. అల్లు అర్జున్ కి అభిమానులు ఇవ్వబోతున్న అందమైన కానుక ఇది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం (7వ తేదీ) మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 8న డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ రేలీజ్ చేస్తున్నాం. మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All