`అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా తరువాత `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ తో కలిసి ముత్యం శెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నారు.
శేషాచలం అడువుల్లో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. బన్నీ ఇందులో లారీ డ్రైవర్గా పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. కేరళ అడవుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. విదేశీ ఫైటర్ల నేపథ్యంలో భారీ బడ్జెట్తో ఓ యాక్షన్ ఘట్టాన్ని ప్లాన్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్వదేశీ ఫైటర్లతో ఆ ఫైట్ని షూట్ చేయాలని భావిస్తున్నారట.
ఈ చిత్రం కోసం ఓ మాస్ మసాల సాంగ్ని ప్లాన్ చేశారు. ఇందులో బాలీవుడ్ హాటీ ఊర్వశీ రౌతేలా నటించనుందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఈ పాట జానపద శౌలిలో సాగుతుందని, సినిమాకు ఈ పాట ఓ హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పాట కోసం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్ని సిద్ధం చేశారట. మాస్ ఆడియన్స్ని ఈ పాట ఓ ఊపు ఊపడం ఖాయమని తెలుస్తోంది.