`ఆహా` ఓటీటీకి మరింత వీవర్ షిప్ని పెంచేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా ఓటీటీలకు భిన్నంగా వుంటూనే కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ని అందించాలని వెరైటీ టాక్ షోలని ప్లాన్ చేశారు. ఆహా లో స్టార్ హీరోయిన్ సమంతతో స్పెషల్గా `సామ్ జామ్` పేరుతో టాక్ షోని ప్రారంభించిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ మొట్టమొదటి స్పెషల్ గెస్ట్గా ఈ టాక్ షో మొదలైంది. రౌడీ హీరో ఎపిసోడ్ అంతా ఊహించినట్టే జాలీ జాలీగా సాగింది. ఆ తరువాత రానా, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఆ తరువాత సైనా నెహ్వాల్ జంట హాజరయ్యారు. త్వరలో తమన్నాకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవలే విడుదల చేశారు. మిగతా ఎపిసోడ్లకి మించి తమన్నా ఎపిసోడ్ ఆసక్తికరంగా వుండేలా కనిపిస్తోంది.
ఇదిలా వుంటే ఈ షో కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఎపిసోడ్ని షూట్ చేశారు. దఇది ఎప్పు స్ట్రీమింగ్ కానుందన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా వుంటే తమన్నా తరువాత బన్నీకి సంబంధించిన ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన షూటింగ్ని పూర్తి చేసినట్టు తెలిసింది. క్రిస్మస్ కానుకగా బన్నీకి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు. బన్నీ ఎపిసోడ్ ఆహాలో ట్రెండింగ్గా మారుతుందో చూడాలి.