అల్లు అర్జున్ నటిస్తున్న క్రేజీ చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. హాసిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్కు ముందే పాటలతో రికార్డులు సృష్టిస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్లో సంచలనంగా మారి సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.
ఈ సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన `సామజ వరగమనా..`, కాసర్ల శ్యామ్ రాసిన `రాములో.. రాములా..` పాటలు ఇటీవల విడుదలై యూట్యూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ని సాధించాయి. రెండు పాటలు కూడా 100 మిలియన్స్ వ్యూస్ దాటి యూట్యూబ్లో చరిత్ర సృష్టించడంతో సోషల్ మీడియాలో హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా మాస్ సాంగ్ `రాములో రాములా..` యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ దాటించినందుకు ప్రేక్షకులకు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అభిందనలు తెలియజేశారు. రాములో రాములా పాటను పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంతో మంది పిల్లల వీడియోలు వచ్చాయి. ఎంతో మంది హృదయాల్ని తాకింది. 100 మిలియన్స్ అన్నది నంబర్ కాదు. మీ అనంతమైన ప్రేమకు ప్రతిబింబం. మీ ప్రేమకు ధన్యవాదాలు` అంటూ ఎమోషనల్ అయ్యారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని తమన్తో పాటు అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. టాబుతో పాటు జయరామ్, మురళీశర్మ, రాజేంద్రప్రసాద్, సుశాంత్, సముద్రఖని, నవదీప్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.