సాధారణంగా తెలుగు సినిమాలకు ప్రమోషన్స్ అంటే మహా అయితే నెల రోజుల నుండి భారీ స్థాయిలో జరుగుతుంటాయి. అప్పుడే పాటల విడుదల, టీజర్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ వరసగా ప్రమోషన్లు ఊదరగొట్టేసి సినిమాను విడుదల చేస్తుంటారు. అయితే అల వైకుంఠపురములో విషయంలో మాత్రం ఈ స్ట్రాటజీని పక్కనపెట్టి కొత్త ఫార్ములా ఫాలో అయ్యారు. సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే అల వైకుంఠపురములో చిత్రం నుండి మొదటి పాట సామజవరగమన ను విడుదల చేయించాడు అల్లు అర్జున్. ఈ నిర్ణయానికి మొదట అల వైకుంఠపురములో టీమ్ కూడా అంత సానుకూలంగా లేకపోయింది. అంత ముందే పాటలు వస్తే సినిమా రిలీజ్ నాటికీ ఫ్రెష్ గా ఉండవేమోనన్నది వారి భయం. అయితే బన్నీ మాత్రం పాటలు ముందే విడుదల కావాలని కోరుకున్నాడు. దానికి తన దగ్గర రీజనింగ్ కూడా ఉంది.
నెల రోజుల ముందు ప్రమోషన్స్ అంటే డిసెంబర్ నుండి అల వైకుంఠపురములో ప్రమోషన్స్ చేయాలి. అయితే ఆ టైమ్ లో చాలా సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. కాబట్టి అందరూ తమ తమ ప్రమోషనల్ మెటీరియల్ తో సిద్ధంగా ఉంటారు. అప్పుడు అల వైకుంఠపురములో నుండి స్టఫ్ వస్తే గుంపులో గోవిందాలా ఉంటుంది. ఆడియన్స్ కు కూడా వినడానికి అషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే సమజవరగమన, రాములో రాముల సాంగ్స్ ను చాలా ముందే విడుదల చేయించాడు. ఈ మూవ్ భలే వర్కౌట్ అయింది. ఆడియన్స్ కేవలం ఈ పాటలే విన్నారు. అందుకే ఈ రెండు పాటలు చెరో 100 మిలియన్ వ్యూస్ ను చేరుకున్నాయి.
రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రం నుండి బుట్ట బొమ్మ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. సామజవరగమన స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు. కానీ ఆ పాటకు వచ్చినట్లుగా దీనికి వ్యూస్ రావట్లేదు. కారణం ఇప్పుడు మార్కెట్ లో వివిధ రకాల సినిమాల పాటలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల వ్యూస్ ఆశించిన రేంజ్ లో రావట్లేదు. అల్లు అర్జున్ ఈ నిర్ణయం వెనకాల ఉన్నాడని స్వయంగా థమన్ వెల్లడించాడు.