ప్రతిష్టాత్మక జిక్యూ ఇండియా దేశంలోని వివిధ రంగాలలో అత్యంత ప్రభావవంతమైన 25 మంది యువ భారతీయుల జాబితాను ప్రకటించింది. మన స్టైలిష్ స్టార్, స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ వారిలో ఒకరు. ఈ జాబితాలో క్రికెటర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, పాపులర్ కమెడియన్ డానిష్ సైట్, నటి అనుష్క శర్మ ఉన్నారు.
వారిని ‘మార్పుకు దారితీసే వ్యక్తులు’ అని పిలుస్తూ GQ ఇన్నోవేటర్లు, ఎంటర్టైనర్స్, డిస్ట్రప్టర్స్, గేమ్-ఛేంజర్స్ అంటూ ఓ జాబితాను తీసుకువచ్చింది. అల్లు అర్జున్ పేరు ఈ యువ చాంనియన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీనికి ప్రధాన కారణంగా ‘అలా వైకుంతపురములో’ చిత్రం నిలిచింది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా మ్యూజికల్ గా సెన్సేషన్ని క్రియేట్ చేసింది.
ఈ మూవీతో అల్లు అర్జున్ దక్షిణ భారతతో పాటు ఉత్తర భారతంలోనూ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోని `బుట్ట బొమ్మ… , `రాములో రాములా పాటలు ఏ స్థాయిలో జన బాహూళ్యంలోకి చొచ్చుకుని వెళ్లాయో యూట్యూబ్ వేదికగా ఎన్ని రికార్డుల్ని సృష్టించాయో అందరికి తెలిసిందే. ఈ రెండు పాటలు యూట్యూబ్ లో 2020 టాప్ 10 మ్యూజిక్ వీడియోలలో చోటు దక్కించుకున్నాయి.