అల్లు రామలింగయ్య నెలకొల్పిన స్టాండర్డ్స్ ను అల్లు అరవింద్ ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ లో టాప్ ప్లేస్ ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అవుతున్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా సినిమాల్లోకి వస్తోంది.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న శాకుంతలం చిత్రంలో అల్లు అర్హ కీలక పాత్ర పోషిస్తోంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో పాల్గొంటోంది. ఆమె మొత్తం 10 రోజులు ఈ సినిమా కోసం పనిచేయనుంది. అల్లు అర్హ రోల్ చాలా ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది. సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తోన్న ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
- Advertisement -
గుణశేఖర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్లో డైరెక్ట్ చేస్తున్న విషయం తెల్సిందే.
- Advertisement -