Homeటాప్ స్టోరీస్కొత్త అస్త్రాలతో సిద్ధమైన అల వైకుంఠపురములో...

కొత్త అస్త్రాలతో సిద్ధమైన అల వైకుంఠపురములో…

కొత్త అస్త్రాలతో సిద్ధమైన అల వైకుంఠపురములో..
కొత్త అస్త్రాలతో సిద్ధమైన అల వైకుంఠపురములో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా సంక్రాంతికే తమ సినిమాను షెడ్యూల్ చేసుకున్న నేపథ్యంలో అల వైకుంఠపురములో టీం ఒక తెలివైన ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఎందుకంటే అల వైకుంఠపురములో కంటే సరిలేరు నీకెవ్వరు బజ్ పరంగా ముందుంది. అందుకే దాన్ని ఎదుర్కోవడానికి అల వైకుంఠపురములో టీం చాలా ముందు నుండే సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ మూవ్ అల వైకుంఠపురములో చిత్రానికి భలేగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. మొదట విడుదల చేసిన పాట సామజవరగమన యూట్యూబ్ రికార్డులను వేటాడింది. ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతోంది. ఇక రెండో సాంగ్ రాములో రాముల సైతం సూపర్ సూపర్ హిట్ అయింది. ఈ పాట కూడా రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే దగ్గరదగ్గరగా 80 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లైక్స్ కూడా 8 లక్షలకు చేరువగా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అల వైకుంఠపురములో చిత్రానికి బజ్ తారాస్థాయికి చేరుకుంది. ఒక దశలో సరిలేరు నీకెవ్వరు కంటే ఈ చిత్రంపైనే ఎక్కువగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

మళ్ళీ సరైన సమయంలో సరిలేరు నీకెవ్వరు ఒక మాస్ టీజర్ ను వదిలి బజ్ ను తమవైపుకి తిప్పేసుకున్నారు. ఆ టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఇక నిన్న ఈ సినిమా నుండి మొదటి పాట మైండ్ బ్లాక్ ను కూడా విడుదల చేశారు. ఈ పాటలో మొదట అంత విషయం లేదని అందరూ అనుకున్నా వినగా వినగా ఎక్కేస్తోంది. ప్రతి సోమవారం ఒక పాట ఉంటుందని టీమ్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో సరిలేరు దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అల వైకుంఠపురములో టీమ్ కౌంటర్ ప్లాన్ తో సిద్ధంగా ఉంది. నిన్ననే సరిలేరు మొదటి పాట విడుదలయ్యే సమయానికే సమజవరగమన 100 మిలియన్ వ్యూస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని టీమ్ కు క్లోజ్ గా ఉండే సోర్స్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు, రేపట్లో అల వైకుంఠపురములో టీజర్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. అది కనుక విడుదలైతే మళ్ళీ బజ్ తమవైపుకి షిఫ్ట్ అవుతుందని అల వైకుంఠపురములో టీం భావిస్తోంది. ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతుండగా ఒకరోజు ముందుగా అంటే జనవరి 11న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

అల వైకుంఠపురములో లో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో టబు, సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, సునీల్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత్ దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All