కరోనా వైరస్ మన దేశాన్ని కబళించిన ఈ పరిస్థితుల్లో మనకు కనపడే దేవుళ్ళు అయిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ వారు మాత్రమే ననీ…. వారు క్షేమం గా ఉండాలనీ, మనం కూడా వాళ్ళు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలనీ, ఆ భగవంతుడిని ప్రార్ధన చేద్దామనీ అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు.
దేశ ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి మేరకు ఈ సాయంత్రం 5 గంటలకు ఎవరికీ వారు మనం ఇంటి నుండి కృతజ్ఞతాపూర్వకంగా కరతాళధ్వనులు చెయ్యాలని నాగార్జున ప్రజలను, అభిమానులను కోరారు. కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా ఎవరికీ వారం స్వచ్చందంగా వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని నాగార్జున విజ్ఞప్తి చేసారు.
Let’s all clap our hands 5 pm this evening along with our prime minister @narendramodi ji To stand united against this deadly Coronavirus!! Stay home stay healthy #JanataCurfew #IndiaFightsCorona
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 22, 2020