తమిళనాట మాత్రమే కాదు ఇండియాలోనే ఎవరికీ లేని ఇమేజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సొంతం , అయితే రోజులు మారాయి గత ఎనిమిదేళ్లుగా రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందుతుండటంతో రజనీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది తాజాగా తమిళనాట అజిత్ నటించిన విశ్వాసం చిత్ర వసూళ్లు ఈ విషయాన్నీ మరోసారి నిరూపిస్తున్నాయి . పొంగల్ బరిలో తమిళనాట రజనీకాంత్ నటించిన పేట , అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలు పోటీ పడి విడుదల అయ్యాయి .
అయితే రజనీకాంత్ చిత్రం ఎనిమిది రోజుల్లో 110 కోట్లు మాత్రమే వసూల్ చేయగా అజిత్ సినిమా మాత్రం 125 కోట్ల వసూళ్ల ని సాధించింది . దాంతో రజనీకాంత్ ని అజిత్ వెనక్కి నెట్టేసినట్లు అయ్యింది , రజనీ క్రేజ్ కూడా తగ్గింది అనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు అజిత్ ఫ్యాన్స్ . రజనీకాంత్ సీనియర్ హీరో అయితే క్రేజ్ లో మాత్రం అజిత్ లేదా విజయ్ ల మద్యే పోటీ ఉందని కూడా వాదిస్తున్నారు అజిత్ ఫ్యాన్స్ . రజనీకాంత్ నటించిన పేట చిత్రం తెలుగులో కూడా విడుదల అయ్యింది కానీ పెద్దగా ఆడలేదు అయితే అజిత్ విశ్వాసం మాత్రం ఇక్కడ రిలీజ్ కాలేదు మరి .
English Title: Ajith’s Vishwasam joins 125 crores club