`బాహుబలి` తరువాత దేశ వ్యాప్తంగా తెలుగు చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి మొదలైంది. తెలుగులో ఏ సినిమా హిట్ అయినా దాని రీమేక్ హక్కుల్ని పోటీపడి మరీ బాలీవుడ్ మేకర్స్.. హీరోలు సొంతం చేసుకుంటున్నారు. తాజాగా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న `బ్రోచే వారెవరురా` మూవీ రీమేక్ హక్కుల్ని దక్కించుకోవడానికి పలువురు బాలీవుడ్ నిర్మాతలు, హీరోలు పోటీపడ్డారు.
శ్రీ విష్ణు, సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ మూవీ హిందీ రీమేక్ హక్కుల్ని ఫైనల్గా ఫ్యాన్సీ రేటుకి హీరో అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ ఛేంజెస్ జరుగుతున్నాయి.
ఈ రీమేక్లో అభయ్ డియోల్తో పాటు సన్నిడియోల్ తనయుడు కరణ్ డియోల్ నటించబోతున్నారు. ఇప్పటికే వీరితో అజయ్ దేవ్గన్ చర్చలు జరిపి ఓకే చేసినట్టు తెలిసింది. న్యూకమర్ దేవన్ ముంజల్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో అజయ్ దేవగన్ వెల్లడించనున్నారట. ప్రస్తుతం అజయ్ దేవగన్ `ఆర్ ఆర్ ఆర్`లో కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.