Homeటాప్ స్టోరీస్అయ్య‌ప్ప‌న్ కోసం ఐశ్వ‌ర్య‌ని దించేస్తున్నారు?

అయ్య‌ప్ప‌న్ కోసం ఐశ్వ‌ర్య‌ని దించేస్తున్నారు?

అయ్య‌ప్ప‌న్ కోసం ఐశ్వ‌ర్య‌ని దించేస్తున్నారు?
అయ్య‌ప్ప‌న్ కోసం ఐశ్వ‌ర్య‌ని దించేస్తున్నారు?

తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్‌కు తెలుగులో వ‌రుస బంప‌ర్ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి. విక్ట‌రీ మ‌ధుసూద‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రామోజీరావు రూపొందించిన చిత్రం `మ‌ల్లె మొగ్గ‌లు`. ఇందులో హీరోగా న‌టించిన అల‌నాటి హీరో రాజేష్ కూతురే ఈ ఐశ్వ‌ర్యా రాజేష్‌. `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత మిస్ మ్యాచ్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ వంటి చిత్రాల్లో మెరిసింది.

ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న `ట‌క్ జ‌గ‌దీష్‌`తో పాటు సాయిధ‌ర‌మ్‌తేజ్‌, దేవా క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతున్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లోనూ అవ‌కాశం ద‌క్కించుకుంది. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఐశ్వ‌ర్య‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ డెకేడ్‌కే వండ‌ర్‌గా నిల‌వ‌నున్న `ఆర్ ఆర్ ఆర్‌`లోనూ గిరిజ‌న యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవే కాకుండా తాజాగా అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లోనూ బంప‌ర్ ఆఫ‌ర్‌ని ద‌క్కించుకుంద‌ని తాజా టాక్‌. ఈ చిత్రాన్ని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రీమేక్ చేస్తున్నారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. ముందు ఈ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని అనుకున్నారు. ప‌వ‌న్ కు భార్య పాత్ర కావ‌డం, ఈ పాత్ర‌కు ప్రాధాన్య‌త కొంత త‌గ్గ‌డంతో ఈ మూవీలో న‌టించ‌డానికి సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో ఆ పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాజేష్‌ని ఫైన‌ల్ చేయాల‌ని టీమ్ భావిస్తోంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All